ఉభయ గోదావరి జిల్లావాసుల వార్తలు, విశేషాల సమాహారం
ఉభయ గోదావరి జిల్లావాసుల వార్తలు, విశేషాల సమాహారం

Friday, May 15, 2015
ఈ పుట్టిన రోజు నాడు, నీవు లేవు కానీ నీ జ్ఞాపకాల వెల్లువలో తడిసిపోతా..!
ఎవరి పుట్టిన రోజు అయినా వాళ్లకు వేడుక గా ఉంటుంది. కానీ ఒకరి పుట్టిన రోజుని మరొకరు గుర్తు ఉంచుకొన్నారు అంటే కచ్చితంగా దానికో కారణం ఉంటుంది. సదరు వ్యక్తి బందువో, మిత్రులో అయ్యుండాలి. లేదా జనం అంతా గుర్తించుకొనే మంచి వ్యక్తి అయి ఉండాలి.
ఇప్పుడు నేను గుర్తు చేస్తున్న వ్యక్తి ఈ రెండో కోవకు చెందిన వారే. ఆయన పేరు సర్ ఆర్దర్ కాటన్. ముద్దుగా కాటన్ దొర గారు అని పిలుచుకొంటారు. గోదావరి నుంచి వెల్లువలా సముద్రంలోకి నదీ జలాలు పోతుంటే నదికి అటు ఇటు ఉన్న జిల్లాల్లోనే పంటలు సరిగ్గా పండని స్థితి ఉండేదట. అటువంటి సమయలో కాటన్ మహాశయుడు స్వయంగా గుర్రం మీద ఈ రెండు జిల్లాలు పర్యటించి ధవళేశ్వరం దగ్గర ఆనకట్ట కట్టాలని నిర్ణయించారు. అక్కడ ఆనకట్టను నిర్మించి నీటికి అడ్డుకట్ట వేసి, అక్కడ నుంచి పంట కాల్వల ద్వారా రెండు జిల్లాలకు సరఫరా అయ్యేట్లుగా ప్రణాళిక రూపొందించి అమలు చేశారు. ఇప్పుడు గోదావరి జిల్లాల్లో రెండు లేక మూడు పంటలు పండుతున్నాయంటే అది నిజంగా కాటన్ మహాశయుడి గొప్పతనమే. తర్వాత కాలంలో ధవళేశ్వరం దగ్గర ఆనకట్టను బ్యారేజ్ గా మార్చి నిర్మించినప్పటికీ, దానికి మూలస్తంభంగా నిలిచింది. కాటన్ గారే. అందుకే ఆయన జయంతి అయిన మే 15న సవినయంగా ఆయనకు అంజలి ఘటిస్తున్నాం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment