ఉభ‌య గోదావ‌రి జిల్లావాసుల వార్త‌లు, విశేషాల స‌మాహారం

ఉభ‌య గోదావ‌రి జిల్లావాసుల వార్త‌లు, విశేషాల స‌మాహారం

Saturday, August 23, 2014

మట్టి చేసే మేలు..

మట్టి అంటే స్వచ్చత కు మారు పేరు అటువంటి మట్టితో చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవన్నీ చెప్పుకొంటూ వస్తే చాంతాడంత అవుతుంది. కానీ ఇప్పుడు ఒక ముఖ్యమైన అంశం మాత్రం చెప్పాల్సి వుంది.
త్వరలోనే వినాయక చవితి వస్తోంది. వినాయకుడి పందిళ్లు ఎక్కువగా పెట్టే నగరాల్లో హైదరాబాద్ ఒకటి. అయితే ప్లాస్టర్ ఆప్ ప్యారిస్ విగ్రహాలు ఎక్కువగా పెట్టడం ఆనవాయితీ గా వస్తోంది. కానీ ఇటువంటి మెటీరియల్స్ తో కాలుష్యం ఎక్కువగా విస్తరిస్తోంది. అందుచేత ఇటువంటి మెటీరియల్స్ ను దూరం పెట్టాలి. లేదంటే ఎంతో భక్తితో పూజించుకొన్న వినాయకుని ప్రతిమ ద్వారా కాలుష్యం విస్తరిస్తుందంటే..అసలు ఆ దేవుడే సహించడు. అందుచేత చక్కగా మట్టితో వినాయకుడి ప్రతిమలు చేయించుకొని ఉపయోగించుకొందాం..పూజలు అందుకొన్న తర్వాత గణ నాధుడ్ని సాగనంపితే ఆయన సంతోషిస్తాడు. మనకు మంచి జరుగుతుంది. అందుకని గణ నాయకుని ప్రతిమలు తీసుకొనేటప్పుడు కాస్తంత జాగ్రత్త తీసుకొంటే మంచిది.